షామీర్పేట్‌లో రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. ఇద్దరికి గాయాలు

by Disha Web Desk 12 |
షామీర్పేట్‌లో రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. ఇద్దరికి గాయాలు
X

దిశ, మేడ్చల్ టౌన్: గుర్తుతెలియని వాహనం బైక్ ను ఢీ కొట్టిన సంఘటన షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. షామీర్పేట్ పోలీసుల వివరాల ప్రకారం.. గురువారం తెల్లవారుజామున మేడ్చల్ నుండి ఆసిఫాబాద్ వైపు ముగ్గురు పల్సర్ బైక్ పై ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో లాల్ గడి మలక్పేట్ జంక్షన్ వద్ద పల్సర్ బైక్ ను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. దీంతో మహారాష్ట్రకు చెందిన రవి (26) అక్కడికక్కడే మృతి చెందగా మరో మరో ఇద్దరు గణేష్, సగాయ్‌కు గాయాలు అయ్యాయి. మృతదేహంతో పాటు గాయాలపాలైన ఇద్దరినీ చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శామీర్పేట్ పోలీసులు తెలిపారు.

Next Story

Most Viewed