- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కాంగ్రెస్, బీఆర్ఎస్ చేసే అబద్ధపు ప్రచారాలు నమ్మకండి : భరత్ ప్రసాద్
దిశ, నాగర్ కర్నూల్ :- బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు అంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ చేసే అబద్ధపు ప్రచారాలు నమ్మకూడదని నాగర్ కర్నూల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ అన్నారు. గురువారం నెల్లికొండలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏ ఊరికి వెళ్లిన, ఏ వాడకి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలతో మమ్మల్ని మోసం చేసిందని ప్రజలు చెప్తున్నారని అన్నారు.బీఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీలకు ప్రధాన మంత్రి అభ్యర్థులే లేరుని ఏద్దేవా చేశారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ ఓటేస్తే రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టే అని ప్రజలకు సూచించారు. రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను మార్చే హక్కు ఏ పార్టీకి, ఎవరికీ లేదన్నారు. భారతదేశ సమన్యాయ అభివృద్ధి బీజేపీ తోనే సాధ్యం అన్నారు. బీజేపీకి 400 సీట్లు వస్తే ప్రపంచంలోనే అతిపెద్ద శక్తివంత దేశంగా ఆవిర్భవిస్తుందన్నారు. జిల్లా ప్రజలందరూ కమలం గుర్తుపై ఓటు వేసి ప్రధాని నరేంద్ర మోడీని మూడోసారి ప్రధానిగా గెలిపించుకోవాలని అన్నారు.ఈ మీడియా సమావేశంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి మృగన్, బీజేపీ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్, బిజెపి జిల్లా అధ్యక్షులు ఎల్లేని సుధాకర్ రావు,పార్లమెంట్ కన్వీనర్ రామకృష్ణారెడ్డి,పార్లమెంట్ అభ్యర్థి ఎలక్షన్ ఏజెంట్జ క్క రఘునందన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.