- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బీజేపీతోనే బీసీలకు న్యాయం
by Disha Web Desk 15 |
X
దిశ, ఖమ్మం టౌన్ : దేశంలో బీజేపీతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని, ఒక బీసీ ప్రధానిగా మోడీ బీసీలకు న్యాయం చేస్తాడని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు ఆశాభావం వ్యక్తం చేశారు. ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు వీరు గౌడ్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన బీసీ సన్నాహక సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. బీసీల ఐక్యతతోనే దేశం అభివృద్ధి చెందుతుందని,
దేశ ప్రధాని బీసీ కావడం గర్వకారణం అన్నారు. మోడీ 10 సంవత్సరాల్లో దేశాన్ని ఎంతో అభివృద్ధి చేశారని, ఖమ్మం పార్లమెంటును గెలిపించి మోడీకి గిఫ్టుగా ఇస్తే దేశ చరిత్రలో ఖమ్మం చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి విజయ రామారావు, ఓబీసీ రాష్ట్ర కన్వీనర్ శ్రీనివాస్, భాను ప్రకాష్, రేఖ సత్యనారాయణ, జ్వాలా నరసింహారావు, రుద్ర మాధవ్, బోయినపల్లి చంద్రశేఖర్, సుధాకర్, అల్లిక అంజయ్య, సరస్వతి తదితరులు ఉన్నారు.
Next Story