బీజేపీ ప్రెసిడెంట్‌లు అందరూ డమ్మి గాళ్ళు: జగ్గారెడ్డి హాట్ కామెంట్స్

by Disha Web Desk 19 |
బీజేపీ ప్రెసిడెంట్‌లు అందరూ డమ్మి గాళ్ళు: జగ్గారెడ్డి హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ అధ్యక్షులపై మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. గాంధీ భవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ప్రెసిడెంట్‌లు అందరూ డమ్మి గాళ్లని.. బీజేపీ ఆఫీస్‌లో ఉండే ఆర్ఎస్ఎస్ వాళ్ళు రాసిచ్చినదే వాళ్ళు మాట్లాడుతారని ఎద్దేవా చేశారు. ప్రస్తుత తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కూడా ఒక స్క్రిప్టెడ్ లీడర్ అని సెటైర్ వేశారు. భారత సంప్రదాయం గురించి కిషన్ రెడ్డికి తెలియదని అన్నారు. సోనియా గాంధీ కుటుంబంలో ఇద్దరు కుటుంబ పెద్దలను దేశం కోసం కోల్పోయారని.. గాంధీ కుటుంబం దేశ ప్రజల కుటుంబమన్నారు. సోనియాగాంధీ 22 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారని.. ప్రధాని కావాలనుకుంటే రెండు సార్లు అయ్యేవారని పేర్కొన్నారు. అలా కాకుండా పీవీ నర్సింహరావు, మన్మోహన్ సింగ్‌లను ప్రధాన మంత్రులను చేశారని గుర్తు చేశారు.

కానీ మోడీని ప్రధాని చేసిన అద్వానీకి అయోధ్యలో కనీసం శాలువా కూడా కప్పలేదని విమర్శించారు. సోనియాగాంధీని విమర్శించే నైతిక హక్కు బీజేపీ నాయకులకు లేదని హెచ్చరించారు. ఉపాధి హామీ పథకం అంటే గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు అక్షయ పాత్ర లాంటిదని.. గ్రామీణ అభివృద్ధి కోసం యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిందని గుర్తు చేశారు. మోడీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఉపాధి హామీ పథకంలో అడ్డమైన ఆంక్షలు పెట్టీ పథకంను నీరు కార్చిందని ఫైర్ అయ్యారు. ప్రధాని మోడీ నిరుపేదలకు శాపంగా మారిండని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, కేసీఆర్, కేటీఆర్ ఎన్నికల్లో ఓడిన ఫ్రస్టేషన్‌లో మాట్లాడుతున్నారని.. అధికారంలో ఉన్న పదేళ్లు వాళ్ల ఎంజాయ్ చూసుకున్నారు తప్ప ప్రజలను ఏనాడు పట్టించుకోలేదని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ దమ్ము లేని క్యాండేట్‌లను నిలబెట్టిందన్నారు. కాంగ్రెస్‌లో స్వేచ్ఛ ఉందని.. ప్రతి పక్ష నేతలకు ఆ పార్టీలో స్వేచ్ఛ లేదన్నారు.



Next Story

Most Viewed