- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఆ పార్టీలో చివరకు మిగిలేది వారే.. పార్టీ అల్లుడి పేరుపై రాయబడుతుంది!.. రాధిక ఖేరా సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ పార్టీలో ఉన్న క్రమశిక్షణ కాంగ్రెస్ పార్టీలో లేదని, కాంగ్రెస్ పార్టీని వారి అల్లుడే రాయించుకుంటాడని ఇటీవలే బీజేపీలో చేరిన రాధిక ఖేరా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో అసలు క్రమశిక్షణే ఉండదని, ఎవరు ఏ పని చేస్తారో తెలియదని, ఎప్పుడు ఏ పని చెబుతారో తెలియదని దానికి నేనే స్పష్టమైన ఉదాహారణ అని తెలిపారు. బీజేపీలో అలా కాదని, చాలా మంచి వాతావరణం ఉంటుందని, ఎవరి పని వారు చేసుకుంటూ పోతున్నారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు ఎవరూ కలిసి నడవరని, ఒకరినొకరు కిందికి లాగుతారని, బీజేపీలో అందరూ కలిసే నడుస్తారని పేర్కొన్నారు. అంతేగాక కాంగ్రెస్ పార్టీలో 30-40 ఏళ్ల నుంచి పని చేస్తున్న కార్యకర్తలకు ప్రాముఖ్యత లేదని, అందుకే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారని, అందరూ వెళ్లిపోయిన తర్వాత చివరికి కాంగ్రెస్ పార్టీలో ఆ కుటుంబం మాత్రమే మిగులుతుందని విమర్శలు చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ అల్లుడైనా రాబార్ట్ వాద్రా పేరుపై వ్రాయబడుతుందని, ఆయనే యజమాని అవుతాడని, అప్పుడు ఆయన ఏదైనా పొందగలడు అని రాధికా ఖేరా సంచలన వ్యాఖ్యలు చేశారు.