- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మోడీ మూడోసారి ప్రధాని అవుతారు.. భారత్ మూడో ఆర్థిక వ్యవస్థగా మారుతుంది: నిర్మలా సీతారామన్
దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మే 9న అన్నారు. మోడీ అధికారంలోకి రాగానే మరుసటి లేదా ఆ తరువాత సంవత్సరాలలో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆమె పునరుద్ఘాటించారు. జార్ఖండ్ రాజధానిలో జరిగిన కార్యక్రమంలో సీతారామన్ మాట్లాడుతూ, మోడీ ప్రభుత్వం రాగానే ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో ఐదో స్థానం నుండి మూడవ స్థానానికి చేరుకుంటుంది, దీనిని సాధించడానికి జార్ఖండ్ సహకారం అవసరమని అన్నారు. దేశ శ్రేయస్సు కోసం, అవినీతి రహిత పాలన అందించడానికి మాకు ఓటు వేయాలని ప్రజలను కోరారు.
ఇంతకుముందు అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) భారత ఎఫ్వై 25 జీడీపీ వృద్ధి అంచనాను 6.8 శాతానికి పెంచింది. అలాగే, మే 8న, ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ మాట్లాడుతూ, ఎఫ్వై 24లో భారతదేశ ఆర్థిక వృద్ధి 8 శాతానికి చేరుకునే అవకాశం ఎక్కువగా ఉందన్నారు.
సీతారామన్ నవంబర్ 2023 లో 2027 నాటికి దేశం జపాన్, జర్మనీలను అధిగమించి మూడవ స్థానానికి చేరుకోవచ్చని అన్నారు. ఈ వ్యాఖ్యల ప్రకారం, ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుండి భారతదేశం మూడవ స్థానానికి చేరుకోవడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం లేదని ఆమె మాటల్లో తెలుస్తుంది.