- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
చిన్న పిల్లాడితో ఓటు వేయించిన బీజేపీ జిల్లా పంచాయితీ మెంబర్!.. (వీడియో వైరల్)
దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికల్లో చిన్న పిల్లాడితో ఓటు వేయించిన ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బోపాల్ పరిధిలోని ఓ పోలింగ్ కేంద్రంలో బీజేపీ జిల్లా పంచాయితీ మెంబర్ ఓ మైనర్ బాలుడితో ఓటు వేయించారు. దీనికి సంబందించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఓ వ్యక్తి ఎలక్షన్ జరుగుతున్న సమయంలో ఓ మైనర్ బాలుడిని పోలింగ్ కేంద్రానికి తీసుకొని వెళ్లాడు. ఆ పిల్లాడికి కమలం గుర్తు ఉన్న బటన్ పై నొక్కమని చెబుతూ.. పిల్లాడితో బీజేపీకి ఓటు వేయించాడు. ఈ చర్యను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎన్నికల కమీషన్ పై దుమ్మెత్తి పోస్తున్నారు. మైనర్ బాలుడిని పోలింగ్ బూత్ లోకి ఎలా అనుమతి ఇస్తారని, ఎలక్షన్ కమీషన్ నిద్ర పోతుందా? ఈ వీడియో ఎన్నికల కమీషన్ కు చేరలేదా? అని పలు రకాల కామెంట్లు పెడుతున్నారు.
A BJP Zilla Panchayat member of #Bhopal, #MadhyaPradesh was seen using his under-18 kid to cast bogus vote in favour of #BJP, he even recorded it and posted on social media.
— Hate Detector 🔍 (@HateDetectors) May 9, 2024
Is #Election commission sleeping? Will there by any action or not?#LokSabhaElections2024 pic.twitter.com/w3FR5gNwaz