YSR చనిపోతే బాధపడ్డాం..కానీ జగన్ మాత్రం? చంద్రబాబు సెన్సేషనల్ కామెంట్స్!

by Disha Web Desk 18 |
YSR చనిపోతే బాధపడ్డాం..కానీ జగన్ మాత్రం? చంద్రబాబు సెన్సేషనల్ కామెంట్స్!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు చాలా తక్కువ సమయం ఉండటంతో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రచారంలో భాగంగా ఇరు పార్టీల నేతలు సభలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక టీడీపీ అధినేత నారా చంద్రబాబు ప్రజాగళం పేరుతో సభ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే కడపలో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీకి ఓటేస్తే మీ ఇంటికి వచ్చేది గొడ్డలేనని కడప ప్రజాగళం సభలో టీడీపీ చీఫ్ చంద్రబాబు విమర్శించారు. నేరాలు-ఘోరాలు చేయడంలో జగన్ పీహెచ్‌డీ చేశారని మండిపడ్డారు. వైఎస్‌ఆర్ చనిపోతే మిత్రుడిని కోల్పోయామని బాధపడ్డామని, కానీ జగన్ మాత్రం అంత్యక్రియలకు ముందే సీఎం కావాలని సంతకాల సేకరణ చేపట్టాడని ఆరోపించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలనేదే కూటమి ఆలోచనని, అందుకు అందరం త్యాగాలు చేశామని చంద్రబాబు గుర్తు చేశారు.

Next Story

Most Viewed