ఎన్నికల వేళ వంగవీటి రాధా సంచలన పిలుపు

by Disha Web Desk 16 |
ఎన్నికల వేళ వంగవీటి రాధా సంచలన పిలుపు
X

దిశ, వెబ్ డెస్క్: మే 13న బటన్ నొక్కి సీఎం జగన్‌ను ఇంటికి పంపుదామని టీడీపీ నేత వంగవీటి రాధా పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లాలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగన్ రెడ్డి సిద్ధం అంటే.. జనసైనికులు సై అంటున్నారని ఆయన వెల్లడించారు. కూటమి అభ్యర్థుల గెలుపు బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రాభివద్ధి సాధ్యమన్నారు. కాపులంతా కూటమికి మద్దతు ఇవ్వాలని వంగవీటి రాధా కోరారు. స్వార్థం కోసం కులాన్ని వాడుకుంటే పదవులు కొంతకాలమే దక్కుతాయన్నారు. ప్రజల కోసం నిలబడటం వల్లే వంగవీటి రంగా పేరు ఇంకా వినిపిస్తూనే ఉందన్నారు. బటన్ నొక్కి జగన్ అలిసిపోయారని.. ఎన్నికల్లో ఇంటికి పంపాలని వంగవీటి రాధా పిలుపునిచ్చారు.

Next Story

Most Viewed