రాయలసీమ అభివృద్ధిపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 16 |
రాయలసీమ అభివృద్ధిపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: వికసిత ఏపీనే తన లక్ష్యమని ప్రధాని మోడీ అన్నారు. బీజేపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి తరపున రాజంపేట నియోజకవర్గం కలికిరిలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాయలసీమ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని మోడీ హామీ ఇచ్చారు. ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని పిలుపునిచ్చారు. చాలా మంది ముఖ్యమంత్రులను రాజయలసీమ ఇచ్చిందని పేర్కొన్నారు. కానీ రాయలసీమ ఇంకా వెనబాటులో ఉందన్నారు. సీమ ప్రజలు వలసపోతూనే ఉన్నారని తెలిపారు. రైతాంగం సైతం నష్టాల్లో ఉందన్నారు. ఏపీలో రౌడీయిజం పెరిగిందన్నారు. ల్యాండ్, గంజాయి మాఫీయా విపరీతంగా రెచ్చిపోతోందన్నారు. ఏపీ ప్రజలను వైసీపీ మోసం చేసిందన్నారు. వైసీపీలో మంత్రులు బూతులతో పెట్రేగిపోతున్నారని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ మాఫీయాకు ట్రీట్‌మెంట్ ఇస్తామని హెచ్చరించారు. రాయలసీమకు స్వచ్ఛమైన నీళ్లు అందించాలని ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టులను పట్టించుకోవడంలేదని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.

Read More...

రాయలసీమ అభివృద్ధిపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

Next Story

Most Viewed