తండ్రిని పోగొట్టుకున్న అక్కాచెల్లెళ్లకు అండగా నిలిచిన లోకేశ్

by Disha Web Desk 16 |
తండ్రిని పోగొట్టుకున్న అక్కాచెల్లెళ్లకు అండగా నిలిచిన లోకేశ్
X

దిశ, వెబ్ డెస్క్: తండ్రిని పోగొట్టుకున్న అక్కా చెల్లెళ్లకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అండగా నిలిచారు. నంద్యాల జిల్లాకు చెందిన పురందేశ్వరి, స్నేహలత అక్కా చెల్లెళ్లు. కరోనా సమయంలో తండ్రి ఆ వైరస్ సోకింది. దీంతో వాళ్ల ఆస్తినంతా అమ్మి వైద్యం చేయించారు. కానీ ఫలితం దక్కలేదు. తండ్రి మరణించారు. అయితే అప్పటి నుంచి అక్కాచెల్లెళ్లలకు కష్టాలు ప్రారంభమయ్యాయి. పురంధేశ్వరి బీటెక్ చదువుతున్నారు. స్నేహలత కూడా చదువుకుంటున్నట్లు తెలిసింది. తండ్రి లేకపోవడంతో వీరి చదువులు అగమ్య గోచరం అయ్యాయి. దీంతో నారా లోకేశ్ ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు.

నంద్యాలలో నారా లోకేశ్ యువగళం సభ నిర్వహించారు. ఈ సభకు హాజరైన పురంధేశ్వరి తన కుటుంబం పడుతున్న అవస్థలపై లోకేశ్ ఎదుట కన్నీరు పెట్టుకున్నారు. దీంతో చలించిపోయిన లోకేశ్ వెంటనే కీలక హామీ ఇచ్చారు. తండ్రి లేరని బాధ పడవద్దని.. అన్నగా తాను అండగా ఉంటానని చెప్పారు. పురంధేశ్వరి, స్నేహలత చదువుల బాధ్యత తాను తీసుకుంటానని భరోసా ఇచ్చారు. ఎంత వరకూ అంత చదువుకుంటానని హామీ ఇచ్చారు. దీంతో సోషల్ మీడియాలో నారా లోకేశ్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Next Story

Most Viewed