టీ20 ప్రపంచకప్‌లో ఆ ఇద్దరిదే కీ రోల్.. రవిశాస్త్రి చెప్పిన ఆ ఇద్దరు ఎవరంటే?

by Dishanational3 |
టీ20 ప్రపంచకప్‌లో ఆ ఇద్దరిదే కీ రోల్.. రవిశాస్త్రి చెప్పిన ఆ ఇద్దరు ఎవరంటే?
X

దిశ, స్పోర్ట్స్ : త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు తరపున యువ క్రికెటర్లు యశస్వి జైశ్వాల్, శివమ్ దూబె కీ రోల్ పోషిస్తారని టీమ్ ఇండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. రవిశాస్త్రి మాట్లాడిన వీడియోను సోమవారం ఐసీసీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ వీడియోలో శాస్త్రి మాట్లాడుతూ.. జైశ్వాల్, దూబెలపై ప్రశంసలు కురిపించాడు. ‘టీ20 ప్రపంచకప్‌లో ఇద్దరు యువ క్రికెటర్ల ఆట చూడాలి. వాళ్లిద్దరూ లెఫ్ట్ హ్యాండర్సే. వాళ్లకు ఇదే తొలి ప్రపంచకప్. ఒకరు జైశ్వాల్. అతని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంగ్లాండ్‌పై అదరగొట్టాడు. టాపార్డర్‌లో నిర్భయంగా ఆడతాడు. మరొకరు శివమ్ దూబె. అతనో మ్యాచ్ విన్నర్. సరదాగా సిక్స్‌లు కొడతాడు. స్పిన్ బౌలింగ్‌లో అయితే రెచ్చిపోతాడు.’ అని చెప్పుకొచ్చాడు. ఇటీవల టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో జైశ్వాల్, దూబెలకు చోటు దక్కిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed