- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
హత్యాయత్నం కేసులో ఇద్దరు రిమాండ్
by Disha Web Desk 15 |
X
దిశ, మెహిదీపట్నం : హత్యాయత్నం కేసులో హుమాయున్ నగర్ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. కేసు వివరాలను ఇన్స్పెక్టర్ సైదీశ్వర్ గురువారం సాయంత్రం వెల్లడించారు. నిందితులు మీర్జా హరూన్ బేగ్ (23) కారు డ్రైవర్. అమెర్ (23) సెంట్రింగ్ లేబర్. వీరిద్దరూ ఫస్ట్ ల్యాన్సర్ లోని బడా బజార్లో ఉంటున్నారు. ఫస్ట్ లాన్సర్లోని
అబూబకర్ అనే వ్యక్తిని తన ఇంట్లో నుంచి బుధవారం తీసుకెళ్లారు. రాత్రి 08:30 గంటలకు వారు బైక్పై వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ అర్ధరాత్రి 2:30 గంటలకు హుమాయూన్ నగర్లోని ఒకాజ్ ప్లాజా దగ్గరకు వచ్చి అక్కడ సిగరెట్ తాగుతుండగా ఒక్కసారిగా మీర్జా హరూన్ బేగ్, అమెర్ తో కలిసి అబూబకర్ మెడ, ఛాతీపై పొడిచాడు. బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
Next Story