- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ముగ్గురి ప్రాణం తీసిన ఈత సరదా
దిశ, ఖమ్మం రూరల్ : గురువారం ఆ స్నేహితుల పాలిట శాపమైంది. వేసవి సెలవులు రావడంతో సరదాగా మున్నేరులో ఈత కొట్టేందుకు వెళ్లారు. ఖమ్మం నగరం మమత హాస్పిటల్ వెనకాల నివాసం ఉంటున్న అముదాల చిరంజీవి కుమారులు అముదాల లోకేష్ (13), అముదాల హరిష్(9), పక్కింటి అబ్బాయి బాణోత్ గణేష్ కలిసి దంసలాపురం వద్ద గల మున్నేరులో
ఈత కొట్టేందుకు వెళ్లారు. మున్నేరు పై హైవే పనులు జరుగుతున్నాయి. వంతెన వద్డ పెద్ద లోయ ఉన్న విషయాన్ని గమనించని ముగ్గురు చిన్నారులు ఆ లోయలో దూకి నీట మునిగారు. గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే కాపాడేందుకు ప్రయత్నించినా అప్పటికే ఆ చిన్నారులు మృత్యువాతపడ్డారు. విషయం తెలుసుకున్న రూరల్ ఎస్ఐ రామారావు సంఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టి, శవాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ హాస్పిటల్కు తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు మృతి
ఈ ఘటనలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు మృత్యువులో సైతం కలిసి వెళ్లారు. చిన్న వయస్సులోనే మరణించడంతో తల్లిదండ్రులు, కుటంబ సభ్యులు రోధిస్తున్నతీరు అందరినీ కంటతడి పెట్టిచ్చింది.