ఉయ్యాలవాడ గ్రామంలో ఉద్రిక్తత

by Disha Web Desk 11 |
ఉయ్యాలవాడ గ్రామంలో ఉద్రిక్తత
X

నాగర్ కర్నూల్ :- భర్త అక్రమ సంబంధాన్ని నిలదీసినందుకు భార్యను చంపి ఫ్యానుకు ఊరేసినట్టు చిత్రికరించాడు కట్టుకున్న భర్త ఈ సంఘటన ఈ నెల 06 న ఉదయం 11 గంటలకు హైదరాబాదులోని వనస్థలిపురం లో చోటు చేసుకుంది. గ్రామస్తులు,కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... నాగర్ కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన సతీష్ రెడ్డి భార్య స్వాతి తో కలిసి హైదరాబాదులోని వనస్థలిపురంలో జీవిస్తున్నారు. వీరికి ఒక కుమార్తె (7)కుమారుడు(3) ఉన్నారు. సతీష్ రెడ్డి హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ ఓ మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు.

ఆ విషయం తెలుసుకున్న స్వాతి భర్త సతీష్ రెడ్డి ని పలుమార్లు నిలదీయడంతో ఈనెల ఆరో తేదీ సోమవారం ఉదయం 11 గంటల సమయంలో ఇంట్లో టీవీ సౌండ్ ఎక్కువ పెట్టి పిల్లలను హాల్లో టీవీ ముందు కూర్చోబెట్టి స్వాతిని బెడ్ రూం లోకి తీసుకెళ్లి గొంతు నమిలి చనిపోయాక ఫ్యానుకు ఉరివేసి అక్కడి నుంచి మెల్లగా వెళ్ళిపోయాడు. పిల్లలు అమ్మ కోసం బెడ్రూంలో వెళ్లి చూడగా అమ్మ ఫ్యానుకు ఉరేసుకున్నదని గమనించి ఏడవడంతో కింద ఉన్న రూమ్ వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు అక్కడికి చేరుకున్నారు. అయితే భర్తనే స్వాతిని చంపి ఉండవచ్చని స్వాతి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు వెంటనే వనస్థలిపురం పోలీస్ స్టేషన్ కు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.

పోలీసులు స్వాతి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు అక్కడికి చేరుకొని ఉయ్యాలవాడలో మా అల్లుని పేరా ఉన్న 10 ఎకరాలు పిల్లల పేరుపై చేయించాలని డిమాండ్ చేశారు. అప్పుడు సతీష్ రెడ్డి సరే అని ఒప్పుకున్నాడు. శవాన్ని ఉయ్యాలవాడకు తీసుకొచ్చాక నేను ఆరు ఎకరాలు మాత్రమే పిల్లల పేరు చేస్తాను అని చెప్పడంతో మూడు రోజులుగా శవంతో ఇంటిముందు స్వాతి కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నేడు గురువారం నాగర్ కర్నూల్ పోలీసులు 50మంది ,50మంది ఆర్మీ జవాన్లు అక్కడికి చేరుకొని ఆ ఉద్రిక్తత మధ్య సతీష్ రెడ్డిని నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ స్టేషన్ కు తరలించారు. మృతదేహన్ని భర్త ఇంటిముందే ఉంచి ఇప్పటికి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed