చెత్త కుప్పల్లో పసికందు మృతదేహం

by Disha Web Desk 15 |
చెత్త కుప్పల్లో పసికందు మృతదేహం
X

దిశ, గుమ్మడిదల : చెత్త కుప్పలో పసికందు మృతదేహం లభ్యమైన ఘటన గుమ్మడిదల మండల పరిధిలోని దోమడుగు గ్రామంలో చోటుచేసుకుంది. దోమడుగు గ్రామంలోని నల్ల పోచమ్మ దేవాలయంకు వెళ్లే మార్గంలోని చెత్తకుప్పలో గురువారం అప్పుడే పుట్టిన మగ శిశువుని గుర్తుతెలియని వ్యక్తులు వదిలిపెట్టి వెళ్లారు. పసికందును గమనించిన పలువురు స్థానికులు గ్రామ ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకు వెళ్లడంతో వారు స్పందిస్తూ.. మండల వైద్యాధికారి డాక్టర్ మధుకర్, అంగన్వాడీ టీచర్లు,

ఆశా వర్కర్లు ఘటన స్థలానికి చేరుకొని శిశువును పరిశీలించారు. కాగా అప్పటికే శిశువు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యదర్శి విష్ణువర్ధన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధితులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ తాజా మాజీ సర్పంచ్ అభి శెట్టి రాజశేఖర్, స్థానికులు డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed